Education· 2 Jun 2026
CBSE పోర్టల్పై సైబర్ దాడి: 2 నిమిషాల్లో 1.5 మిలియన్ల హిట్స్!
CBSE రీ-ఇవాల్యుయేషన్ పోర్టల్ ప్రారంభమైన మొదటి రోజే భారీ సైబర్ అటాక్ జరిగింది. సర్వీసులను నిలిపివేయడమే లక్ష్యంగా హ్యాకర్లు కేవలం రెండు నిమిషాల్లో 1.5 మిలియన్ల (15 లక్షలు) రిక్వెస్ట్లతో ‘డినైల్ ఆఫ్ సర్వీస్’ (DoS) దాడికి పాల్పడ్డారు. అంతేకాదు, ఫైల్స్ను దొంగిలించడానికి లక్షకు పైగా అనధికారిక ప్రయత్నాలు జరిగాయి. అయినప్పటికీ, భద్రతా వ్యవస్థల వల్ల పోర్టల్ ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా పనిచేసిందని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని CBSE బోర్డు ‘X’ వేదికగా స్పష్టం చేసింది.