National· 4h ago
మారుమూల ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు
మారుమూల ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలను దగ్గర చేసేందుకు సుప్రీంకోర్టు 26 మొబైల్ ఈ-సేవా వ్యాన్లను ప్రారంభించనుంది. సుప్రీంకోర్టు ఈ-కమిటీ పర్యవేక్షణలో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని మధ్యానం 2 గంటలకు సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, ఈ-కమిటీ ప్యాట్రన్-ఇన్-చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ప్రారంభించారు. జాతీయ న్యాయ సేవల సంస్థ, న్యాయశాఖ సహకారంతో ఈ వ్యాన్లు పనిచేస్తాయి. వీటి ద్వారా ఈ-కోర్టు సేవలు, ఈ-ఫైలింగ్, ఈపేమెంట్, మొబైల్ లోక్ అదాలత్లు, ఉచిత న్యాయ సహాయం, న్యాయ అవగాహన అందించనున్నారు.