Local

రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఓఎన్‌జీసీ చేయూత
Local· 4d ago

రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఓఎన్‌జీసీ చేయూత

రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి ఓఎన్‌జీసీ సంస్థ చేయూత అందించింది. ఓఎన్‌జీసీ ఆధ్వర్యంలో కళాశాలకు 47 బెంచీలు, 5 కంప్యూటర్లను అందించారు. కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ డా.పితాని సాయిబాబు అధ్యక్షత వహించారు. రాజమహేంద్రవరం ఓఎన్‌జీసీ అసెట్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌, హెచ్‌ఆర్‌ హెడ్‌ శ్రీ రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని బెంచీలు, కంప్యూటర్లను కళాశాల యాజమాన్యానికి అందించారు. ఎమ్మెల్యే దేవవరప్రసాద్ హాజరై కళాశాలలో ఇండోర్‌ స్టేడియం నిర్మాణానికి సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.