AP· 28 Apr 2026
ఏపి బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత, ఓ ఆక్వారైతు ఆక్రందన
ఏపీలో ప్రధాన బంకుల్లో పెట్రోల్ , డీజిల్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎక్కడ చూసినా బంకుల దగ్గర చాంతాడంత క్యూ కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల బంకులను డీజిల్ లేక మూసేస్తున్నారు.అనేక చోట్ల రూల్స్ పాటించని బంకులను అధికారులు సీజ్ చేస్తున్నారు.పల్నాడు జిల్లాలో మూడు,నర్సరావు పేట, పిడుగురాళ్ల, చిలకలూరి పేటల్లో బంకులను సీజ్ చేశారు. ఇటీవల ఓ బంకు దగ్గర ఆక్వారైతన్న 500 రూ. ల విలువైన డీజిల్ పోయండి. నా రొయ్య పిల్లలు చనిపోతాయంటూ ఆవేదన వ్యక్తం చేసిన వీడియో వైరల్ గా మారుతోంది.