కరిగిపోయిన డాలర్ డ్రీమ్స్.. అమెరికాలో కర్నూలు యువకుడు ఆత్మహత్య

చికాగో యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసినా ఉద్యోగం రాకపోవడంతో కర్నూలు జిల్లాకు చెందిన ఇరగనబోయిన చందు(26) అమెరికాలో ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు కోసం తండ్రి చేసిన లక్షల రూపాయల అప్పులు, ప్రస్తుత జాబ్ మార్కెట్ పరిస్థితులు చందును మానసిక ఒత్తిడికి గురిచేశాయి. ఆ ప్రెజర్ భరించలేక నిండు ప్రాణాలు తీసుకున్నాడు. చందు మృతదేహాన్ని స్వగ్రామానికి పంపేందుకు అక్కడి ఇండియన్ కమ్యూనిటీ విరాళాలు సేకరిస్తోంది. కొడుకు మరణవార్త విన్న ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.



