TG· 1 May 2026
రైతన్న గుండెలు పిండే ఆవేదన !!
ప్రజల ఆకలి తీర్చడమే తప్ప మరే కల్మషం తెలియని అన్నదాతకు సొంత బిడ్డయినా, తోడుగా నిలిచే పశువులైనా, పంటయినా ఒకటే. వీటిలో ఏది కోల్పోయినా వారి బాధ వర్ణణాతీతం. తాజాగా తెలంగాణ లో నిర్మల్(D)లోని పలు గ్రామాల్లో చేతికందే ఎత్తులో ఉన్న విద్యుత్ లైన్లతో షార్ట్ సర్క్యూట్ అయి మొక్కజొన్న, వరి, జొన్న పంటలు బూడిదయ్యాయి. దీంతో రైతులు విలపిస్తున్న దృశ్యాలు గుండెలను పిండేస్తున్నాయి. వీరిని ఆదుకోవడం అధికారుల కనీస బాధ్యత.