కుర్చీ తాత మృతి

కుర్చీ మడతపెట్టి సాంగ్ ఫేమ్ తాత మహమ్మద్ పాషా మృతి చెందారు. హైదరాబాద్ కృష్ణా నగర్ లో నివాసం ఉంటున్న ఆయన నిన్న కృష్ణకాంత్ పార్క్ లో వాకింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తీసుకుని వెళ్లేసరికి ఆయన మరణించారు. వడదెబ్బ తగలడంతో ఆయన మృతి చెందినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఆ కుర్చీని మడత పెట్టి అన్న డైలాగ్ తో SMలో ఫేమస్ అయిన పాషా గుంటూరు కారం మూవీలో మహేష్ తో కలిసి స్టెప్పులేశారు.



