Entertainment· 21 Aug 2026
నలుగురు సీఎంలతో స్క్రీన్ షేర్ చేసుకున్న జానకి
ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత లాంటి నలుగురు సీఎంలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సీనియర్ నటిగా షావుకారు జానకి నిలిచారు. 1931 డిసెంబర్ 12న రాజమండ్రిలో జన్మించిన ఆమె అసలు పేరు శంకరమంచి జానకి. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలలో 400 పైగా సినిమాలలో నటించారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోని ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు. ప్రముఖ నటి కృష్ణకుమారి ఆమె చెల్లెలే. అక్కాచెల్లెళ్లు హీరోయిన్లు అయ్యే ట్రెండ్ను వాళ్లే స్టార్ట్ చేశారు.