Entertainment· 21 May 2026
ఆ శాలువాపై చిరు, పవన్, చరణ్ డ్రాయింగ్స్!
చిరంజీవి, డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వస్తున్న కొత్త మూవీ పూజా కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. ఈ ఈవెంట్కి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాగబాబు చీఫ్ గెస్టులుగా వచ్చారు. అయితే అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ జరిగింది. మూవీ టీమ్ చిరంజీవి, పవన్ కళ్యాణ్లను ఒక స్పెషల్ శాలువాతో సన్మానించింది. ఆ శాలువాపై చిరంజీవి, పవన్, రామ్ చరణ్ల ఫేసెస్ డిజైన్ చేసి ఉన్నాయి. ఆ డిజైన్ చూసి మెగా బ్రదర్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. ఈ మెగా మూమెంట్కి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.