కనెక్టెడ్ టీవీల జోరు.. లైవ్ స్పోర్ట్స్కు భారీగా పెరిగిన వ్యూయర్షిప్!

ఇండియాలో లైవ్ స్పోర్ట్స్ మార్కెట్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్, ఫిఫా వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీల డిజిటల్ వ్యూయర్షిప్ గతంలో కంటే భారీగా పెరిగింది. ముఖ్యంగా సాంప్రదాయ టీవీల కంటే 'కనెక్టెడ్ టీవీ (CTV)' లీనియర్ ప్లాట్ఫామ్ వైపు ప్రేక్షకులు వేగంగా మొగ్గు చూపుతున్నారు. FICCI నివేదిక ప్రకారం, గతేడాదితో పోలిస్తే కనెక్టెడ్ టీవీల వాడకం ఏకంగా 33% పెరిగింది. కేవలం స్మార్ట్ ఫోన్లలోనే కాకుండా, ఇళ్లలోని పెద్ద స్క్రీన్లపై డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా క్రీడలను వీక్షించే వారి సంఖ్య కోట్లకు చేరింది.



