ఫాంహౌస్లో రియల్టర్ బలవన్మరణం.. కలకలం

TG: రంగారెడ్డి జిల్లా కందుకూరులోని నేదునూరుకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి బాణాల రాంరెడ్డి రాంబాబు తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. కాగా రాంరెడ్డి ఆత్మహత్యకు గల కారణం ఏంటన్నది తెలియాల్సి ఉంది. అయితే ఇవాళ ఆత్మహత్య నివారణ దినంనాడే రాంరెడ్డి ఈ ఘాతుకానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

