AIతో 80sకి వెళ్లిన పొలిటికల్ లీడర్స్!

సోషల్ మీడియాలో ఇప్పుడు 80s వైబ్ కనిపిస్తోంది. AIతో ఇప్పటి ఫొటోలను 1980ల నాటి హెయిర్స్టైల్, డ్రెస్సింగ్, ఫిల్మ్ కెమెరా లుక్లోకి మార్చేస్తూ చాలామంది పోస్ట్లు చేస్తున్నారు. ఈ ట్రెండ్లో పీయూష్ గోయల్, కిరణ్ రిజిజు, అస్సాం CM హిమంత బిశ్వ శర్మ తమ రెట్రో ఫొటోలను షేర్ చేశారు. BJP కూడా ప్రధాని మోదీ రెట్రో ఫొటోను పోస్ట్ చేసింది. కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఫొటోను షేర్ చేసింది. పాతకాలపు ఫీల్ కోసం పాత కెమెరా అవసరం లేదు, AI ఉంటే చాలు! నిన్నటి స్టైల్ను నేటి టెక్నాలజీతో మళ్లీ క్రియేట్ చేయచ్చు.



