హాంకాంగ్పై భారత మహిళల జట్టు భారీ విజయం

మహిళల ఆసియా కప్ 2026లో భారత జట్టు హాంకాంగ్పై 137 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. దుబాయ్లో జరిగిన మ్యాచ్లో స్మృతి మంధాన 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 124 పరుగులు చేయగా, భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసింది. ఛేదనలో హాంకాంగ్ 16.2 ఓవర్లలో 56 పరుగులకు ఆలౌటైంది. ప్రేమా రావత్ 2 వికెట్లు తీయగా, నందిని శర్మతో సహా ఇతర బౌలర్లు రాణించారు. ఇప్పటికే థాయ్లాండ్ను ఓడించిన భారత్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తదుపరి మ్యాచ్ శనివారం పాకిస్తాన్తో జరగనుంది.



