తల్లి కులంతోనూ రిజర్వేషన్ వర్తిస్తుందన్న మద్రాస్ హైకోర్టు

కుల ధ్రువీకరణ అనేది కేవలం తండ్రి కులాన్ని అనుసరించే ప్రక్రియగా మాత్రమే ఉండకూడదని, తల్లి సామాజిక నేపథ్యం ఆధారంగా కూడా పిల్లలకు రిజర్వేషన్లు వస్తాయని మద్రాస్ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పుదుచ్చేరిలో స్థానిక మహిళలను వివాహం చేసుకున్న వలసదారుల పిల్లల కుల ధ్రువీకరణకు సంబంధించిన 28 పిటిషన్లపై కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. తల్లి SC, MBC, OBC వర్గాలకు చెందినదైతే, అది విస్మరించడం వివక్షకు దారితీస్తుందని చెప్పింది. ఇది దేశవ్యాప్త తీర్పు కాదని, పుదుచ్చేరి స్థానిక పరిస్థితులకు లోబడే వర్తిస్తుందని వివరించింది.


