పంటలు పోయే.. కరెంటు రాదాయే.!
తెలంగాణ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని చెబుతుంటే.. సీఎం సొంత గ్రామంలో రైతులు.. పంటలు ఎండిపోతున్నాయంటూ, తీవ్ర ఆవేదనతో పాటలు పాడుతూ, తమ గోడు చెబుతూ.. ధర్నా చేశారు. నాగర్కర్నూల్ జిల్లా.. కొండారెడ్డిపల్లి దగ్గర్లోని శ్రీశైలం-హైదరాబాద్ నేషనల్ హైవేపై రైతులు ఈ మెరుపు ధర్నా చేపట్టారు. తమకు రోజూ 6 నుంచి 8 గంటలు మాత్రమే కరెంటు వస్తోందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు హెచ్చరించారు.



