AP· 17 Jun 2026
చిన్నారి మిస్సింగ్ కేసులో బొమ్మలతో వినూత్న ప్రయోగం
AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో మిస్సైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. పాప చివరిగా కనిపించకుండా పోయిన తోట, కొండ ప్రాంతంలో అడవి జంతువుల సంచారం ఉందేమోనన్న అనుమానంతో చిన్నారి ఆకారం పోలిన రెండు చిన్న బొమ్మలను ఇనుప కంచెకు అమర్చి, వాటిపై మాంసాహారాన్ని ఉంచారు. గత 11 రోజులుగా NDRF, SDRF, హనుమాన్ టీమ్, అటవీశాఖ, పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. గతంలో థర్మల్ డ్రోన్లు, నైట్ ట్రాప్ కెమెరాలతో జల్లెడ పట్టినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో బొమ్మల ప్రయోగాన్ని చేపట్టారు.