Local

శంకవరం ఎస్సీ హాస్టల్ వెంటనే తెరవాలి... లేదంటే...
Local· 22 Aug 2026

శంకవరం ఎస్సీ హాస్టల్ వెంటనే తెరవాలి... లేదంటే...

కాకినాడ జిల్లా శంకవరం ఎస్సీ హాస్టల్ మూసివేతపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అన్నవరంలో జరిగిన దళిత ఐక్య రౌండ్ టేబుల్ సమావేశంలో హాస్టల్‌ను తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేదంటే సోమవారం కాకినాడ కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. హాస్టల్ మూసివేతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, విద్యా హక్కుతో ముడిపడిన అంశాన్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని నాయకులు మండిపడ్డారు. సోమవారం దళిత, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని తంతటి కిరణ్, మధుబాబు ప్రకటించారు.

హాడ్గావ్‌లో అధికారుల నిర్లక్ష్యం.. కుంటలోనే చెత్త పారవేత
Local· 22 Aug 2026

హాడ్గావ్‌లో అధికారుల నిర్లక్ష్యం.. కుంటలోనే చెత్త పారవేత

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హాడ్గావ్‌లో పరిశుభ్రతపై అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించకుండా, గ్రామ సమీపంలోని కుంటలో పారబోస్తున్నారు. ఇది పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారింది. చెత్త కుంటలో పడటంతో దుర్వాసన, పరిశుభ్రత సమస్యలు తీవ్రమయ్యాయి. స్థానిక సమస్యలను ఎంపీఓ పర్యవేక్షించకపోవడం, రికార్డులను తనిఖీ చేయకపోవడమే ఇందుకు కారణమని ప్రజలు మండిపడుతున్నారు. బాధ్యతారహితంగా ఉన్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: డీసీసీ
Local· 22 Aug 2026

క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతమే లక్ష్యం: డీసీసీ

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండల కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండల అధ్యక్షులు కిషన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.<br>సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మండల కమిటీ ఎన్నికల కోసం నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా సుగుణక్క మాట్లాడుతూ, పార్టీ నిబంధనలకు లోబడి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులను ఆదేశించారు.

సీహెచ్‌సీలో నిరుపయోగ జనరేటర్.. రోగుల ఇబ్బంది
Local· 22 Aug 2026

సీహెచ్‌సీలో నిరుపయోగ జనరేటర్.. రోగుల ఇబ్బంది

మందసలోని హరిపురం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జనరేటర్ నిరుపయోగంగా మూలుగుతోంది. పవర్ కట్ సమయాల్లో జనరేటర్ సౌకర్యం ఉన్నా సద్వినియోగం చేసుకోకపోవడంతో విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. డీజిల్ లేదనే సాకు లేదా సిబ్బంది నిర్లక్ష్యంతో జనరేటర్ ఆన్ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సూపరింటెండెంట్ డా. స్వరాజ్యలక్ష్మి వివరణ ఇస్తూ జనరేటర్ పనిచేయడం లేదని, ఇన్వర్టర్లను వాడుతున్నామని చెప్పారు.