ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు.. వేంసూరు వాసి మృతి

యాదాద్రి దొంతిగూడెంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి ఓ కెమిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. వేంసూరుకు చెందిన నరసింహకుమార్ అక్కడ 4 ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఇంట్లో పెళ్లి మాటలు నడుస్తున్న సమయంలోనే ఈ విషాదం మూడింది. తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ప్రమాదంలో వెంకటాపురానికి చెందిన చెన్నకేశవులు కూడా గాయపడ్డాడు. పేలుడుతో కంపెనీలో ఒక్కసారిగా హడావుడి మొదలైంది. పూర్తి వివరాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది.



