పిచ్చుకలపాలెం మాదిగల స్మశానవాటికకు ఆక్రమణల నుంచి విముక్తి

శావల్యాపురం మండలం పిచ్చుకలపాలెంలోని మాదిగల స్మశానవాటికపై ఆక్రమణలు తొలగించడంతో దళితులు ఊరట చెందారు. సర్వే నెంబర్ 280-2 (LP నెం.1643)లో 299 సెంట్ల స్మశానవాటికను కొందరు ఆక్రమించి పంటలు సాగు చేస్తున్న విషయాన్ని స్థానిక దళితులు, ప్రజా సంఘాలు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు స్మశానవాటిక చుట్టూ బౌండరీ ఏర్పాటు చేశారు. ఆక్రమణలకు తావు లేదని హెచ్చరిస్తూ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ఈ చర్యతో స్మశానవాటిక ఆక్రమణల నుంచి విముక్తి పొందింది.



