రైతుల కోసం 'పాము' పాఠాలు..

పాము కనిపిస్తే చాలు జనం పరుగెత్తుతారు, కానీ మహారాష్ట్ర ఎన్సీపీ నేత రోహిణి ఖడ్సే మాత్రం తన పొలంలో కనిపిస్తే భయపడకుండా ఏకంగా చేతుల్లోకి తీసుకున్నారు. అది విషం లేని 'జెర్రిపోతు' పాము అని, పంటలను నాశనం చేసే ఎలుకలను తింటూ రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆమె అంటున్నారు. భయంతో ఇలాంటి ఉపయోగపడే పాములను చంపేయొద్దని, పర్యావరణాన్ని కాపాడుకుందామని ఆమె తెలిపారు.



