రిషభ్ పంత్ హిస్టారిక్ రికార్డ్!

టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ టెస్ట్ క్రికెట్లో చారిత్రాత్మక రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారత ప్లేయర్గా నిలిచాడు. శ్రీలంకతో మ్యాచ్లో 66 రన్స్ చేసే క్రమంలో రెండు సిక్సర్లు కొట్టి ఈ ఘనత సాధించాడు. దీంతో సెహ్వాగ్ (90), రోహిత్ శర్మ (88)లను వెనక్కి నెట్టాడు. అత్యంత వేగంగా 51 టెస్టుల్లోనే ఈ మార్క్ చేరుకోగా, ప్రపంచ స్థాయిలో ఈ ఘనత సాధించిన నాల్గో ప్లేయర్గా నిలిచాడు.



