విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం

TG: ఖమ్మం జిల్లా వేంసూర మండలం కుంచపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టెన్త్ క్లాస్ పరీక్షల్లో 500కు పైగా మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థులను గ్రామానికి చెందిన ఇజ్జగాని మధు అభినందించారు. ఒక్కో విద్యార్థికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.30 వేలను అందించారు. విద్యార్థులు మరింత ఉన్నతంగా రాణించాలనే ఉద్దేశంతో ఈ సహాయాన్ని అందించినట్లు తెలిపారు.


