చీకటిలో ఆసుపత్రి!
నారాయణపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం వరకు కరెంట్ పోవడంతో ఆసుపత్రి ప్రాంగణమంతా చీకటిగా మారిపోయింది. జనరేటర్ సదుపాయం లేకపోవడంతో వార్డుల్లోని పేషెంట్లు, చిన్న పిల్లలు, వృద్ధులు, అటెండర్లు ఉక్కపోత, తీవ్రమైన దోమలతో రాత్రంతా ఇబ్బంది పడ్డారు. వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రిలోనే ఇలాంటి పరిస్థితులు ఉండటంపై బాధితుల కుటుంబాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.



