సర్కారీ బడులకు తాళం

దేశవ్యాప్తంగా గత పదేళ్లలో 94 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని 'నీతి ఆయోగ్' తాజా రిపోర్టు తెలిపింది. అంటే రోజుకు సగటున 25 బడులు బంద్ అయ్యాయి. ప్రభుత్వ బడులు మూతపడటం వల్ల విద్యార్థుల అడ్మిషన్లు 2.26 కోట్లు తగ్గిపోయాయని, ప్రైవేట్ పాఠశాలల సంఖ్య భారీగా పెరిగిందని 'నీతి ఆయోగ్' రిపోర్టు తెలిపింది. తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది బడులను మూసేసి, ప్రైవేట్ స్కూళ్లకు సపోర్ట్ చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. పేద విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నారని ప్రతిపక్షాలు, ప్రజలు మండిపడుతున్నారు.



