పెళ్ళైన మహిళలకు 8 గ్రా. బంగారం, పట్టుచీర.. అసెంబ్లీలో ప్రకటన

తమిళనాడు అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2026-27 ఫైనాన్షియల్ ఇయర్కు ఫైనాన్స్ మినిస్టర్ మేరీ విల్సన్ బడ్జెట్ ప్రసంగం చేశారు. మహిళల వెల్ఫేర్కు ప్రయారిటీ ఇస్తూ కొత్త పథకాలను ప్రకటించారు. పెళ్ళైన మహిళలకు 8 గ్రాముల గోల్డ్ కాయిన్, పట్టుచీర అందించే ప్రత్యేక స్కీమ్ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం అమలు కోసం బడ్జెట్లో రూ.812 కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు. మహిళలకు భరోసా కల్పించడం, వివాహ ఖర్చుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు.



