మహిళలకు ఫ్రీ.. మగవాళ్లపై మోత: ప్రయాణికుడు ఫైర్

TG : నర్సంపేట నుంచి ఉప్పల్కి ఉదయం సూపర్ లగ్జరీ బస్సులో 390 రూపాయిలతో టికెట్ తీసుకున్న ఒక ప్రయాణికుడికి, సాయంత్రం తిరుగు ప్రయాణంలో 560 రూపాయిలు ఛార్జ్ చేశారు. ఒకే రోజులో 170 రూపాయిలు ఎందుకు పెంచారని స్టాఫ్ ని ప్రశ్నించగా ఛార్జీలు పెరిగాయని అంటున్నారు. ముందుగా చెప్పకుండా ఇలా సడన్గా పెంచడంపై ప్రయాణికుడు మండిపడ్డాడు. లేడీస్కి ఫ్రీ బస్సు అని చెప్పి, ఆ భారమంతా తమపైనే వేస్తున్నారని, ఆఫీసర్లు దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరాడు.

