టైర్లలో కోట్ల విలువైన బంగారం!
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గోల్డ్ స్మగ్లింగ్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జెద్దా నుంచి వచ్చిన ఒక ప్యాసింజర్ ఎలక్ట్రిక్ స్కూటర్ టైర్ల లోపల సీక్రెట్గా దాచిన 869.5 గ్రాముల 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అతని మూవ్మెంట్స్పై డౌట్ వచ్చి చెక్ చేయగా ఈ షాకింగ్ స్మగ్లింగ్ ప్లాన్ బయటపడింది. ఆ గోల్డ్ను సీజ్ చేసిన అధికారులు, ఆ ప్యాసింజర్ను కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేస్తున్నారు.



