కళ్లముందే వరద.. పిల్లల్ని కాపాడిన అమ్మ ధైర్యం!
నేపాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్న వేళ.. ఓ తల్లి తన పిల్లలను కాపాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక్కసారిగా వరద వేగం పెరిగినా.. పిల్లల చేతులను వదలకుండా జస్ట్ సెకండ్స్లోనే వారిని సేఫ్గా ఒడ్డుకు చేర్చింది. కిందపడినా వెంటనే లేచి, పిల్లలను తీసుకుని కొండ ప్రాంతం వైపు పరుగులు తీసింది. రెండు సెకన్లు లేట్ అయినా సిట్యువేషన్ ఎలా ఉండేదో ఊహించలేం. భయానికి లొంగకుండా వెంటనే రియాక్ట్ అయ్యి పిల్లలను కాపాడిన ఆ తల్లి ధైర్యానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.



