స్మార్ట్ సిటీ రోడ్డు.. పైపులైన్ టెస్ట్కే కుంగిందా?
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా దాదాపు రూ.40 కోట్లతో రోడ్డు నిర్మించారు. ఆ రోడ్డులో ఎక్కువ భాగం ఒక్కసారిగా కుంగిపోయింది. నిన్న గోరకుండ్ చౌక్ దగ్గరలో కొత్తగా ఏర్పాటు చేసిన నీటి పైపులైన్ను టెస్ట్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. పైపును కనెక్ట్ చేసిన తరువాత హై ప్రెజర్ కారణంగా నీరు రోడ్డుకింద నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చింది. కొద్దిసేపటికే రోడ్డు కుంగిపోయి భారీ గుంత ఏర్పడింది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.



