← Back to news

సిరిసిల్లలో మరమగ్గాలు ఆగిపోయినయ్.. 4వ రోజు!

By Jagadish· 10h ago
సిరిసిల్లలో మరమగ్గాలు ఆగిపోయినయ్.. 4వ రోజు!

కాటన్ చీరలను తయారు చేసే 500 మరమగ్గాలు ఇప్పుడు పని చేస్తలేవు. సాంచాల సప్పుడు కూడా ఇనిపస్తలేదు. నాలుగు రోజులైంది. ఒక చీరపై వర్కరుకు, ఆసామికి రూ.17.50 చొప్పున కూలి పెంచాలని అక్కడి ఓనర్లను అడిగితే పట్టించుకోలే. రెండేళ్లకోసారి హైక్ ఇవ్వాలన్నది ఒప్పందం. 2yrs దాటి మరో 2yrs అయ్యింది. అందుకే వర్కర్లు, ఆసాములంతా కలిసి ఆగస్టు 31నుంచి strike లోకి వెళ్లారు. ''మేమేమన్న వాటాలడుగుతున్నమా? ఒక దిక్కు ధరలు పెరుగుతుంటే నాలుగేళ్ల నుంచి కూలీ పెంచట్లే. న్యాయమైనదే ఇవ్వాలంటున్న''మని CITU లీడర్ కోడం రమణ చెబుతున్నారు.

More in TG