రోడ్డుపై బస్సు ఆపి..తమ్ముడికి రాఖీ కట్టిన అక్క
TG: రాఖీ పండగ వేళ ఒక అక్క తన తమ్ముడి కోసం క్రేజీ మూమెంట్ క్రియేట్ చేసింది. గోదావరిఖని నుంచి హైదరాబాద్ వెళ్తున్న RTC డ్రైవర్ రాజు కరీంనగర్ తిమ్మాపూర్ దగ్గర డ్యూటీలో ఉన్నాడు. అతని అక్క స్వప్న, హైవేపై బస్సు ఆపించి మరీ తన తమ్ముడికి రాఖీ కట్టింది. రోడ్డుపైన జరిగిన ఈ క్యూట్ అండ్ ఎమోషనల్ సీన్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



