డయల్-100 కాల్తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు
TG: హనుమకొండ జిల్లా మడికొండ పోలీస్ స్టేషన్కు ఎమర్జెన్సీ కాల్(డయల్-100కు) రావడంతో కానిస్టేబుళ్లు సంతోష్, గోవర్ధన్ వెంటనే రెస్పాండ్ అయ్యి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. తనకు తాను నిప్పంటించుకున్నాడని ఇన్ఫర్మేషన్ రావడంతో స్పాట్కు చేరుకొని పోలీసులు బాధితుడి మంటలు ఆర్పీ రక్షించారు. బెటర్ ట్రీట్మెంట్ కోసం వరంగల్లోని హాస్పిటల్కు తీసుకెళ్లారు. కానిస్టేబుళ్ల ధైర్యసాహసం, సమయస్ఫూర్తిని స్థానికులు, అధికారులు ప్రశంసిస్తున్నారు. ఆ వ్యక్తి నిప్పంటించుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



