← Back to news

కులతత్వం అంతమైతే నో రిజర్వేషన్స్

By Sahani· 8h ago· India
కులతత్వం అంతమైతే నో రిజర్వేషన్స్

దేశంలో కులతత్వాన్ని రద్దు చేస్తే తాము రిజర్వేషన్లు వదులుకుంటామని కేంద్రమంత్రి, RPI చీఫ్ రాందాస్ అఠావలె అన్నారు. రిజర్వేషన్లను వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధమని, వెనుకబడిన వర్గాల కోసమే వాటిని తెచ్చారని చెప్పారు. అంటరానితనం నిషేధించినా దళితులు, గిరిజనులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గార్భా నృత్యాల్లోకి ముస్లింలను అనుమతించవద్దన్న VHP పిలుపును తప్పుపట్టారు. రాజ్యాంగం ప్రకారం ఏ మతపరమైన ఈవెంట్స్‌లోనైనా భారతీయులందరూ పాల్గొనవచ్చని తేల్చిచెప్పారు.

More in Current Affairs

పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్
Current Affairs· 3h ago

పిల్లల ఆన్‌లైన్ సేఫ్టీపై సుప్రీం కీలక కామెంట్స్

పిల్లలు సోషల్ మీడియా వాడకంపై సుప్రీంకోర్టు కీలక కామెంట్స్ చేసింది. పిల్లలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ఈజీగా యాక్సెస్ చేస్తుండటంతో.. వారికి సేఫ్టీ గైడ్‌లైన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపింది. ఆన్‌లైన్ వేధింపుల నుంచి మైనర్లను ఎలా కాపాడతారో చెప్పాలని కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ పిటిషన్‌పై విచారణలో ఈ కామెంట్స్ చేసింది. ఆటో కంటెంట్ ఫిల్టర్లు, ఏజ్ వెరిఫికేషన్ ఉండాలని పిటిషనర్లు కోరారు. అల్గారిథమ్స్ పిల్లలకు ఏజ్‌కు మించిన కంటెంట్ చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

CJP ప్రొటెస్టులో పాల్గొన్నాడని నోటీసులు.. సుప్రీం సీరియస్!
Current Affairs· 1d ago

CJP ప్రొటెస్టులో పాల్గొన్నాడని నోటీసులు.. సుప్రీం సీరియస్!

గ్రేటర్ నోయిడాలోని లా స్టూడెంట్ అక్షత్ త్రిపాఠీకి మేజిస్ట్రేట్ రూ.5 లక్షల పర్సనల్ బాండ్‌పై నోటీసు ఇచ్చారు. జులైలో ‘క్రాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) నిరసనలో పాల్గొన్నాడని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయితే స్టూడెంట్స్‌పై ఎలాంటి యాక్షన్స్ తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. దీంతో 'నోటీసులు ఇవ్వడానికి మేజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం' ఎలా ఇచ్చారంటూ CJI సూర్యకాంత్ ప్రశ్నించారు. నోటీసును తర్వాత వెనక్కి తీసుకున్నా, దీనిపై జిల్లా మేజిస్ట్రేట్ నుంచి ఎక్స్‌ప్లనేషన్ కోరాలని కోర్టు తెలిపింది.