← Back to news

బుర్ఖాలో వచ్చి.. గోల్డ్ చైన్ చోరీ

By Mahesh· 7 Aug 2026· TG

TG: వికారాబాద్‌ జిల్లా తాండూరులోని గాంధీచౌక్‌లో గంజిపల్లి సాయి జ్యువెలర్స్‌లో చోరీ జరిగింది. కస్టమర్ల ముసుగులో బుర్ఖాలు వేసుకొని వచ్చిన ఐదుగురు.. స్టాఫ్ దృష్టి డైవర్ట్ చేసి కౌంటర్‌లోని 10 గ్రా. గోల్డ్ చైన్‌ను దొంగలించారు. చోరీ తరువాత నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఘటనకు సంబంధించి విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వైరల్‌గా మారిన సీసీటీవీ విజువల్స్ బేస్ చేసుకుని పోలీసులు కేసు బుక్ చేసి నిందితుల కోసం వెతుకుతున్నారు.

More in Cinema