ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ: CM రేవంత్

TG: హైదరాబాద్లోని చంచల్గూడ-సంతోష్నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సభలో CM రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయిందని, బ్రిడ్జి నిర్మాణానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ఫండ్స్ ఇచ్చి ఫ్లైఓవర్ పూర్తి చేసిందన్నారు. ఓల్డ్ సిటీ కాదు.. ‘ఒరిజినల్ సిటీ’ అని అన్నారు. అసదుద్దీన్ అడిగిన డెవలప్మెంట్ పనులకు ఫండ్స్ ఇస్తామని చెప్పారు. వచ్చే ఎలక్షన్స్లోగా చాంద్రాయణగుట్ట వరకు మెట్రో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.



