పార్శి న్యూ ఇయర్!

ఆగస్టు 15న పార్శి నూతన సంవత్సరం 'నవ్రోజ్' సందర్భంగా ఢిల్లీలోని పార్శి ఇళ్లలో పండగ వంటల సందడి మొదలైంది. ఉదయాన్నే రవ్వ, పాయసంతో మొదలుపెట్టి, మధ్యాహ్నానికి సల్లీ గోష్ట్, పాత్రా నీ మచ్ఛీ, చికెన్ బెర్రీ పులావ్, దాల్ పాలా వంటి రుచికరమైన విందు సిద్ధం చేసుకుంటారు. 'లగన్-ను-కస్టర్డ్' స్వీట్ కచ్చితంగా తింటారు. ఈ రోజూ ఇళ్లను శుభ్రం చేసి ముగ్గులు, పూలతో అలంకరిస్తారు. సాంప్రదాయ దుస్తులు ధరించి అగ్ని దేవాలయంలో ప్రార్థనలు చేస్తారు.
