మసీదులో వినాయక చవితి.. మహారాష్ట్ర ఘనత

మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాల్వా తాలూకాలోని గోట్ఖిండీ గ్రామంలో జరిగే వినాయక చవితి మతసామరస్యాన్ని చాటుతోంది. చవితి సందర్భంగా న్యూ గణేశ్ మండలి జుజర్ చౌక్ మసీదులో గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. 10 రోజుల పాటు పూజలు చేస్తారు. 1980 నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 1961లో భారీ వర్షంలో గణపతి విగ్రహం తడిసిపోతుంటే స్థానిక ముస్లింలు మసీదులోకి తీసుకెళ్లి రక్షించారు. ఆ తర్వాత అది సంప్రదాయంగా మారింది.


