వెలిగొండతో కరువు నేలకు కొత్త ఊపిరి: చంద్రబాబు

AP: కరువు నేలపై కృష్ణా జలాలతో కొత్త చరిత్ర ప్రారంభమైందని CM చంద్రబాబు అన్నారు. మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం గంటవానిపల్లెలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశను CM ప్రారంభించారు. నల్లమలసాగర్లోకి కృష్ణా జలాలను విడుదల చేశారు. వెలిగొండతో పశ్చిమ ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్యకు ముగింపు పలుకుతుందని, ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు త్యాగం చేసిన 11 గ్రామాల ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.



