AP· 4 Aug 2026
భద్రత కరువు.. భయం నీడలో కాలనీలు
AP: విశాఖపట్నం భీమునిపట్నం పరిధిలోని మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనీ, బక్కన్నపాలెం ప్రాంతాల్లో భద్రతా సమస్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. 5,200కుపైగా కుటుంబాలు నివసిస్తున్న ఈ ప్రాంతాల్లో వీధి దీపాలు, CC కెమెరాలు లేకపోవడంతో దొంగతనాలు, వాహనాల నుంచి పెట్రోల్ చోరీలు పెరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. రాత్రివేళల్లో మద్యం మత్తులో అల్లర్లు, రాష్ డ్రైవింగ్ కారణంగా మహిళలు, వృద్ధులు భయంతో బయటకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.