AP

ప్రియాంక ఘటనపై హైటెన్షన్.. విద్యాసంస్థలు బంద్
AP· 9 Aug 2026

ప్రియాంక ఘటనపై హైటెన్షన్.. విద్యాసంస్థలు బంద్

AP: రాజమహేంద్రవరం మెడికో ప్రియాంక ఘటనలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపు రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్లు మాజీ MP మార్గాని భరత్ తెలిపారు. ప్రియాంకను కారు ఢీకొట్టిన ఘటన తర్వాత నిందితులపై కేసు నమోదు విషయంలో పోలీసులు ఆలస్యం చేశారని ఆరోపించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్‌కల్యాణ్, ఇతరులెవరూ పరామర్శించలేదని విమర్శించారు. నిందితులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు చేశారు. ఆమె కాసేపటి క్రితమే చికిత్స పొందుతూ <a href="https://www.theclearcutnews.com/n/Bs69Rid">మృతి</a> చెందిన విషయం తెలిసిందే.

కూతురు జ్ఞాపకాలను మరిచిపోలేక భావోద్వేగ నిర్ణయం
AP· 9 Aug 2026

కూతురు జ్ఞాపకాలను మరిచిపోలేక భావోద్వేగ నిర్ణయం

AP: రెండున్నరేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి <a href="https://www.theclearcutnews.com/n/b9hxZvG">అదృశ్యమై</a> దాదాపు 65రోజులు గడుస్తున్నా ఆచూకీ <a href="https://www.theclearcutnews.com/n/hYPgSsi">లభించకపోవడం</a>తో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో జూన్‌ 6న చిన్నారి కనిపించకుండా పోయింది. పోలీసులు, SDRF, NDRF బృందాలు గాలింపు చేపట్టినా ఎలాంటి ఆధారం <a href="https://www.theclearcutnews.com/n/WtyuUGy">దొరకలేదు</a>. చిన్నారి వెంట వెళ్లిన పెంపుడు కుక్క మూడురోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చి మృతి చెందింది. కూతురు జ్ఞాపకాల నుంచి బయటపడేందుకు తల్లిదండ్రులు మరో కుక్కపిల్లను ఇంటికి తెచ్చుకుని దానికి జాను అని పేరు పెట్టుకున్నారు.

చావుబతుకుల పోరాటం ముగిసింది.. మెడికో మృతి
AP· 9 Aug 2026

చావుబతుకుల పోరాటం ముగిసింది.. మెడికో మృతి

AP: రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన మెడికో ప్రియాంక మృతి చెందారు. బ్రెయిన్‌‌డెడ్‌ కావడంతో సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మద్యంమత్తులో ఉన్న సూరవరపు దస్వంత్‌, ఆండ్రూ జోసెఫ్‌ <a href="https://www.theclearcutnews.com/n/BNi4iQK">ర్యాష్‌ డ్రైవింగ్‌</a> చేస్తూ స్కూటీపై వెళ్తున్న ప్రియాంకను రాజమహేంద్రవరంలో కారుతో మూడుసార్లు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడటంతో తొలుత స్థానిక ఆస్పత్రిలో, అనంతరం కిమ్స్‌లో చికిత్స అందించారు. నిందితులను పోలీసులు <a href="https://www.theclearcutnews.com/n/ontXSYW">అరెస్ట్</a> చేశారు.

వాహనంలో ఇరుక్కుపోయిన డ్రైవర్లు.. ఇద్దరి కండిషన్ సీరియస్!
AP· 9 Aug 2026

వాహనంలో ఇరుక్కుపోయిన డ్రైవర్లు.. ఇద్దరి కండిషన్ సీరియస్!

అనంతపురం జిల్లా పామిడి మండలం పోగూరు దగ్గర ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ ఘోరమైన యాక్సిడెంట్‌కి గురైంది. ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న ఈ బస్, ఎదురుగా వస్తున్న ఐచర్ వెహికల్‌ని డైరెక్ట్‌గా ఢీకొట్టింది. ఆ ఇంపాక్ట్‌కి బస్ కంట్రోల్ తప్పి హైవే పక్కనే ఉన్న కల్వర్టు పైనుంచి కింద పడిపోయింది. ఈ యాక్సిడెంట్‌లో 18 మంది ప్యాసింజర్స్‌కి సీరియస్ ఇంజ్యూరీస్ అయ్యాయి. బస్, ఐచర్ డ్రైవర్లు క్యాబిన్‌లోనే ఇరుక్కుపోవడంతో.. పోలీసులు, స్థానికులు వాహనం భాగాలను కట్ చేసి వాళ్లని బయటికి తీశారు. ప్రజెంట్ ఇద్దరి కండిషన్ సీరియస్‌గా ఉంది.

ప్రియాంక కేసులో పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
AP· 8 Aug 2026

ప్రియాంక కేసులో పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు

AP: మెడికో ప్రియాంక ఘటనపై డిప్యూటీ CM పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్ DIGతో ఫోన్‌లో మాట్లాడి ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఈ నెల 3న రాజమండ్రిలో సినిమా థియేటర్ వద్ద ప్రియాంక, ఆమె స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తుండగా ఇద్దరు యువకులు కారుతో బైక్‌ను <a href="https://www.theclearcutnews.com/n/BNi4iQK">ఢీకొట్టారు</a>. అనంతరం మరోసారి ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.