AP· 10 Aug 2026
చంద్రగిరి అటవీ ప్రాంతంలో 22 ఏనుగులు
AP: తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని ఎర్రవారిపాలెం అటవీ ప్రాంతంలో 22 ఏనుగులు సంచరిస్తున్నట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సిద్ధలగండి చెరువు సమీపంలో ఏనుగులున్నాయని, వీఆర్ కాలనీ, వేములవాడ, కోటకడపల్లి గ్రామాల వైపు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అయ్యగారిపల్లి, పులిగోనపల్లి, నెరబైలు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.