← Back to news

బీసీల రుణం తీర్చుకుంటాం: చంద్రబాబు

By dk· 8 Aug 2026· బాపట్ల జిల్లా
బీసీల రుణం తీర్చుకుంటాం: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో బీసీల సంక్షేమం, సంరక్షణకు త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురానున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. బీసీలు 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచారని, కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని అన్నారు. వారి రుణం తీర్చుకుంటామని తెలిపారు. బాపట్ల జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ‘నేతన్నల సేవలో’ పథకాన్ని CM ప్రారంభించారు. రాష్ట్రంలోని 71,536 అర్హులైన చేనేత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.179 కోట్లను విడుదల చేశారు.

More in AP