AP· 25 Jul 2026
పిల్లలు భారం కాదు.. భవిష్యత్తుకు ఆస్తి
AP: పిల్లలు భారం కాదని, భవిష్యత్తుకు వారే అసలైన ఆస్తి అని CM చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ‘తల్లికి వందనం’ పథకాన్ని డబ్బు కోసం కాదు, మనసుతో అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలకు త్వరలో ఉచితంగా సోలార్ ప్యానెల్స్ అందిస్తామని ప్రకటించారు. హైస్కూల్ నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బోధిస్తామని, మూడు నెలలల్లోపు ప్రతి ఇంటికీ ఫోన్, వైఫై ఉండాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు.