← Back to news

ఎల్‌నినో ముప్పు.. అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలి

By DK· 24 Jul 2026
ఎల్‌నినో ముప్పు.. అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలి

AP: దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో ఈసారి క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందని CM చంద్రబాబు హెచ్చరించారు. తాగునీటి కొరతతో పాటు పశుగ్రాస సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎల్‌నినో పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఆయన, తాగునీటి సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పశుగ్రాస కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సంక్షోభాన్ని ఎదుర్కోవాలని సూచించారు.

More in AP