← Back to news

మంగళగిరిలో పురాతన గణేశ విగ్రహాలు లభ్యం

By RK· 24 Jul 2026
మంగళగిరిలో పురాతన గణేశ విగ్రహాలు లభ్యం

AP: గుంటూరు జిల్లా కాజ గ్రామంలో 1,600 ఏళ్ల నాటి రెండు చిన్న గణేశ విగ్రహాలు లభ్యమయ్యాయి. రైతు వెంకట్రామరెడ్డి పొలంలో దున్నుతుండగా నాగలికి తగిలి బయటపడ్డాయి. ఎర్ర ఇసుక రాతితో చేసిన ఈ విగ్రహాలు 3 సెంటీమీటర్లు, మరొకటి 5 సెంటీమీటర్ల ఎత్తు వున్నాయి. వీటితోపాటు 1-4వ శతాబ్దానికి చెందిన రంగుల మట్టిపాత్రల పెంకులు దొరికాయి. పల్నాడు జిల్లా చేజర్ల ఆలయంలోని విగ్రహంలా ఉండే ఈ చిన్న విగ్రహాలకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందని పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి చెప్పారు.

More in AP