Sports· 21 Jul 2026
చైనా IMOలో ఇండియాకు ఆరు మెడల్స్
చైనాలోని షాంఘైలో జరుగుతున్న 67వ ఇంటర్నేషనల్ మాథెమాటిక్స్ ఒలింపియాడ్ (IMO) ఈరోజుతో ముగియనుంది. ఈ ఒలింపియాడ్లో భారతీయ విద్యార్థులు మరోసారి అద్భుత ప్రతిభను కనబరిచారు. రెండు గోల్డ్ మెడల్స్ నాలుగు సిల్వర్ మెడల్స్ సాధించారు. గోల్డ్ మెడల్స్ సాధించినవారిలో ఆరవ్ గుప్తా, ఏబెల్ జార్జ్ మాథ్యూ ఉన్నారు. బైరవ్ మురుగన్, కనవ్ తల్వార్, సంజన ఫిలో చాకో, శ్రేయ శాంతను ముంధడ రజత పతకాలను గెలుచుకున్నారు. కనవ్ తల్వార్, ఆరవ్ గుప్తా, జార్జ్ మాథ్యూ గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన IMO-2025లో స్వర్ణ పతకాలను సాధించినవారే.