← Back to news

847 పుష్‌అప్స్‌తో గిన్నిస్ రికార్డు

By RK· 24 Jul 2026

హర్యానాకు చెందిన 41 ఏళ్ల రోహ్‌తాష్ చౌదరీ నడుముపై 27 కిలోల బరువు పెట్టుకుని గంటలో 847 పుష్‌అప్స్ తీసి గిన్నిస్ రికార్డు సృష్టించాడు. గతంలో ఒక యాక్సిడెంట్ వల్ల రెండేళ్లు మంచానికే పరిమితమైన పట్టుదలతో కోలుకుని, పట్టుదలతో ప్రాక్టీస్ చేసి 'పుష్‌అప్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా సిరియా వ్యక్తి రికార్డును దాటి ప్రపంచ రికార్డు సాధించాడు. అతడి ప్రతిభకు గిన్నిస్ సంస్థ ప్రత్యేక సర్టిఫికెట్ అందించింది.

More in Sports