హిట్మ్యాన్ రిటైర్మెంట్?.. లండన్ చేరుకున్న పేరెంట్స్

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ భవిష్యత్తుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇంగ్లాండ్తో ఆదివారం లార్డ్స్లో జరిగే వన్డే మ్యాచ్ అతడి చివరి మ్యాచ్ కావొచ్చని ప్రచారం జరుగుతోంది. రోహిత్ తల్లిదండ్రులు ఇప్పటికే లండన్ చేరుకున్నట్లు సమాచారం. 2027 వన్డే ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకుని యువ ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇవ్వాలని BCCI సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీనిపై ఆదివారం మ్యాచ్ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



