Latest

TGEJAC పిలుపు మేరకు MRO కార్యాలయం ముందు నిరసన
Local· 3d ago

TGEJAC పిలుపు మేరకు MRO కార్యాలయం ముందు నిరసన

పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా CPS రద్దు చేసి OPS అమలు చేయాలని రాష్ట్ర TEJAC పిలుపుమేరకు నెక్కొండ తాసిల్దార్ కార్యాలయం ముందు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి TJAC నాయకులు DTF రాష్ట్ర కమిటీ సభ్యులు జాన్ నాయక్ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్లు అయినా రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయపరంగా , రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 2వ పిఆర్సిని జాప్యం లేకుండా ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న 6 డి ఏ లను వెంటనే ఇప్పించాలని, 10,000 కోట్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని కోరారు.

నందిపేట్‌లో రేషన్ బియ్యం సీజ్..! అక్రమ రవాణాపై ఉక్కుపాదం
Local· 3d ago

నందిపేట్‌లో రేషన్ బియ్యం సీజ్..! అక్రమ రవాణాపై ఉక్కుపాదం

నిజామాబాద్ జిల్లా నందిపేట్‌ మండలం రైతుఫామ్‌ శివారులో పోలీసులు, సివిల్‌ సప్లయ్స్‌ అధికారులు భారీ రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం ఎస్సై కె. వినయ్‌కు సమాచారం అందడంతో వాహనాల తనిఖీలు చేపట్టగా, AP25X9971 నంబర్‌ గల మహీంద్రా బొలేరోలో 48 సంచుల్లో 22.60 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం గుర్తించారు. దీని విలువ సుమారు రూ.1,12,548. రేషన్ బియ్యాన్ని వాహనాల్లో తోలుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీని వెనుక ఎవరున్నారనేది ఇంకా తెలియలేదు. ఇది పేదల పొట్ట మీద కొద్దిమంది పందికొక్కుల చేసే దాడి.

నిమ్స్‌లో MRP ముసుగులో దోపిడీ! రోగులకు టార్చర్
Local· 3d ago

నిమ్స్‌లో MRP ముసుగులో దోపిడీ! రోగులకు టార్చర్

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలోని బాలాజీ మెడికల్ షాప్ అక్రమాలకు పాల్పడుతోందని పేషంట్లు వాపోతున్నారు. అనారోగ్యంతో అల్లాడుతున్న రోగుల బలహీనతను ఆసరాగా చేసుకుని, MRP పేరుతో పూర్తి ధర వసూలు చేస్తున్నారని చెబుతున్నారు. అత్యవసర మందులు, సర్జికల్ ఐటమ్స్, విటమిన్ ట్యాబ్లెట్లపై తీవ్రస్థాయిలో దోపిడీ సాగుతోంది. ఎక్కడా డిస్కౌంట్ లేదు, రూపాయి కూడా తగ్గించడం లేదు! ఈ షాపు గరిష్ట చిల్లర ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తక్షణం డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు చేయాలని పేషంట్ల డిమాండ్.

సిద్దాపూర్ డంపు యార్డ్ పై ఎస్టీ కమిషన్ నోటీసులు..!
Local· 3d ago

సిద్దాపూర్ డంపు యార్డ్ పై ఎస్టీ కమిషన్ నోటీసులు..!

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామంలో ఎకో టౌన్ పేరిట డంపు యార్డు ఏర్పాటు వివాదాస్పదమైంది. ప్రభుత్వం 80 ఎకరాల్లో డంపు యార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో సిద్దాపూర్, పరిసర గ్రామస్తులు గత కొద్ది నెలలుగా ఆందోళన చేస్తున్నారు. ఈ డంపు యార్డ్ వల్ల పరిసర తాండాలకు నష్టం జరుగుతుందని గిరిజన నేత రాంబల్, నాయక్ జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్టీ కమిషన్ జిల్లా కలెక్టర్‌కు, కాలుష్య నివారణ మండలికి నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం డంపు యార్డును తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అసైన్డ్ భూమిలో రోడ్డు.. చర్యలకు డిమాండ్!
Local· 3d ago

అసైన్డ్ భూమిలో రోడ్డు.. చర్యలకు డిమాండ్!

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం పీర్ల తాండలో అసైన్డ్ భూమిలో అక్రమ రోడ్డు నిర్మాణం వెలుగులోకి వచ్చింది. సర్వే నంబర్ 120/50/4/Aలో అధికార అనుమతులు లేకుండా సుమారు 40 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తున్నారని BSP నారాయణఖేడ్ ఇంచార్జి అనుముల, తుకారాం ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పట్టాదారు ఆక్షేపణ లేదన్నా, నిబంధనలకు విరుద్ధంగా పనులు సాగడం ఆందోళనకరమన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పనులు ప్రస్తుతం నిలిచిపోయాయి. సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తుకారాం డిమాండ్ చేశారు.

బుధవారం పలు ఆర్టీసీ సర్వీసులు రద్దు
Local· 3d ago

బుధవారం పలు ఆర్టీసీ సర్వీసులు రద్దు

బుధవారం అనకాపల్లి జిల్లా, పాయకరావుపేటలో జరగబోయే, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బహిరంగ సభకు ఆర్టిసి బస్సులు కేటాయించారు. ఈ సందర్భంగా ఏలేశ్వరం డిపో పరిధిలోని 25 సాధారణ బస్సు సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్లు డిపో మేనేజర్ జీవి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రయాణికులు అత్యవసరమైతే తప్ప , తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. అత్యవసరంగా ప్రయాణించే ప్రయాణికులు, ముందస్తుగా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాటు చేసుకుని, ఆర్టీసీకి సహకరించవలసిందిగా కోరుతున్నామన్నారు.

అమరావతిపై డ్రోన్ కన్ను..!
Local· 3d ago

అమరావతిపై డ్రోన్ కన్ను..!

గుంటూరు జిల్లా అమరావతిలో పోలీసులు డ్రోన్ టెక్నాలజీతో నిఘా పెంచారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో తాడేపల్లి, తుళ్లూరు, మందడం, వెంకటపాలెం, వెలగపూడి, సీతానగరం, కృష్ణానది కరకట్ట ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ జరుగుతోంది. ప్రత్యేకంగా పేకాట, కోళ్ల పందేలు, గంజాయి, బహిరంగ మద్యం సేవనంపై దృష్టి పెట్టారు. రాత్రి వేళల్లో నైట్ విజన్ డ్రోన్లతో అనుమానాస్పద కదలికలను గుర్తిస్తున్నారు. అవసరమైతే ఇతర ప్రాంతాలకు నిఘా విస్తరించనున్నారు. అయితే ఇలాంటి నిఘాను ప్రజాందోళనల మీద ప్రయోగించకూడదని ప్రజలు కోరుతున్నారు.

చెల్పూర్‌లో కంప్యూటర్ ల్యాబ్.! విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యం
Local· 3d ago

చెల్పూర్‌లో కంప్యూటర్ ల్యాబ్.! విద్యా నైపుణ్యాలకు ప్రాధాన్యం

కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ మండలం చెల్పూర్‌లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శుభవార్త. మంగళవారం ఆ పాఠశాలలో కొత్తగా కంప్యూటర్ ల్యాబ్‌ను MEO శ్రీనివాస్ ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక విద్య అందించేందుకు ఇదొక మంచి అడుగు. అనంతరం ఆయన తరగతి గదులు పరిశీలించి, విద్యార్థుల ప్రగతిని తెలుసుకున్నారు. వారి చదవడం, రాయడం, సంఖ్యా పరిజ్ఞానాన్ని పరీక్షించి, ఉపాధ్యాయులతో చర్చించారు.<br>ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడుతూ, "ప్రాథమిక నైపుణ్యాలను చిన్నతనం నుంచే పెంపొందించాలి" అని సూచించారు.

ముద్ర యోజన పేరుతో.. 6 లక్షల మోసం!
Local· 3d ago

ముద్ర యోజన పేరుతో.. 6 లక్షల మోసం!

హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగాపూర్ గ్రామంలో ఓ షాకింగ్ మోసం వెలుగులోకి వచ్చింది. వడ్డేపల్లి, జనార్ధన్ కు 'ప్రధానమంత్రి ముద్ర యోజన' పేరుతో ఫోన్ చేసి, లోన్ ఇప్పిస్తామని నమ్మించారు.<br>లోన్ ప్రాసెస్ కోసం డబ్బు కావాలంటూ దశలవారీగా 6 లక్షల రూపాయలు మాయం చేశారు. ఈ మోసం తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, ఎస్సై రాజు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.<br>ఇది ఎంత పెద్ద మోసమో ఊహించడం కష్టమే! మీకు కూడా ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నాయా? Xలో @CyberCrimeCell కి ట్యాగ్ చేసి అప్రమత్తం చేయండి.

‘CPS వద్దు.. OPS ముద్దు’.. HYD లో ఉపాధ్యాయుల ధర్నా
Local· 3d ago

‘CPS వద్దు.. OPS ముద్దు’.. HYD లో ఉపాధ్యాయుల ధర్నా

HYD లోని ఇందిరాపార్క్ వద్ద రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి తరలివచ్చిన ఉపాధ్యాయులు PRTUTS ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ‘CPS వద్దు.. OPS ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. వెంటనే PRC అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ తదితర జిల్లాల నుంచి ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని MLC శ్రీపాల్ రెడ్డి కోరారు.

ANU స్వర్ణోత్సవ వేడుకలు- పూర్వ విద్యార్థులకు VC ఆహ్వానం
Local· 3d ago

ANU స్వర్ణోత్సవ వేడుకలు- పూర్వ విద్యార్థులకు VC ఆహ్వానం

గుంటూరుజిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యా లయంలో బుధవారం నాడు పూర్వ విద్యార్థుల సమ్మేళ నం నిర్వహించనున్నారు. 1976-2026 బ్యాచ్‌లకు చెంది న 3వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, 1,500 మంది హాజరుకానున్నారు.వర్శిటీ పూర్వ విద్యార్థులకు వి.సి గంగాధర్ రావు మీడియా ముఖంగా ఆహ్వానించారు. ఈ స్వర్ణోత్సవ సంబరాలకు యూనివర్సిటీలో చదువు కుని ఒక హోదాలో ఉన్న ప్రముఖులు హాజరు కానున్నారని వి.సి తెలిపారు.కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు జరుగ తున్నాయని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

ఘోర రోడ్డు ప్రమాదం  ఇద్దరు విలేజీ సెక్రటరీలకు గాయాలు
Local· 3d ago

ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు విలేజీ సెక్రటరీలకు గాయాలు

శ్రీకాకుళం జిల్లా హిరమండలం మండలం, ధనపురం గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు తీవ్రంగా గాయపడ్డారు. బూరగాం పంచాయతీ కార్యదర్శి ఉదయశ్రీ, రొంపివలస కార్యదర్శి ప్రసన్న ఇందులో గాయపడ్డారు. ప్రమాదం తీవ్రతకు స్థానికులు షాక్ అయ్యారు. వెంటనే స్పందించి, క్షతగాత్రులను పాతపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం, వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఇద్దరినీ శ్రీకాకుళం తరలించారు. ప్రమాద కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఛలో విజయవాడకు రెడీ..! UTF పోస్టర్ ఆవిష్కరణ
Local· 3d ago

ఛలో విజయవాడకు రెడీ..! UTF పోస్టర్ ఆవిష్కరణ

ఉపాధ్యాయులు చలో విజయవాడ పేరిట ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. మంగళవారం గాజువాక మండల విద్యాశాఖ కార్యాలయం వద్ద “ఛలో విజయవాడ” పోస్టర్‌ను UTF నాయకులు ఇమంది, ప్రసాద్, సబ్బారపు, నూకరాజు ఆవిష్కరించారు. స్పెషల్ టెట్‌లో ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు మినహాయింపులు లేవని, దీన్ని నిరసిస్తూ సెప్టెంబర్ 3న విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారు. మాన్యువల్ పరీక్ష విధానం, అందరికీ 40% పాస్ మార్కులు, సబ్జెక్టు ప్రాధాన్యం, ప్రభుత్వ హామీల మేరకు టెట్ నోటిఫికేషన్‌లో మార్పులు కావాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇసుకతో పవన్ రూపం.. వినూత్న శుభాకాంక్షలు!
Local· 3d ago

ఇసుకతో పవన్ రూపం.. వినూత్న శుభాకాంక్షలు!

EG జిల్లా రంగంపేటలో ఓ వినూత్న కళారూపం ఆకట్టుకుంది. దేవిన శ్రీనివాస్ కుమార్తెలు సోహిత, ధన్యత ఇసుకతో పవన్ కళ్యాణ్ రూపాన్ని తీర్చిదిద్దారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ అద్భుతం చేశారు. 'హ్యాపీ బర్త్ డే పవన్ సార్', 'ప్రజాసేవలో పవన్' అనే సందేశాలు ఇందులో ఉన్నాయి. ఇంత క్రియేటివిటీ చూసి స్థానికులు ఆశ్చర్యంగా నిలబడిపోయారు. ప్రజలతో ముడిపడిన అంశాలపై మీకు కూడా ఇలా పది మంది ముందు ప్రదర్శించే క్రియేటివిటీ ఉంటే మాకు షేర్ చేయండి. మేమూ షేర్ చేస్తాం. ఆల్ ది బెస్ట్

AI చేసిన ఆర్ట్‌కు కాపీరైట్ ఉంటుందా?
Technology· 3d ago

AI చేసిన ఆర్ట్‌కు కాపీరైట్ ఉంటుందా?

AIతో ఒక బొమ్మ తయారు చేయడం ఇప్పుడు పెద్ద విషయం కాదు.. కానీ ఆ బొమ్మ మీద కాపీరైట్ ఎవరిది? ఇదే ప్రశ్న భారత్‌లో ఓ కేసు ద్వారా ముందుకొచ్చింది. DABUS అనే AI సిస్టమ్ రూపొందించిన ‘A Recent Entrance to Paradise’ అనే ఆర్ట్‌వర్క్‌కు కాపీరైట్ కోరగా, భారత కాపీరైట్ కార్యాలయం AIని రచయితగా గుర్తించలేమని స్పష్టం చేసింది. ఆర్ట్ ఒరిజినల్‌గా ఉన్నా.. దాన్ని తయారు చేసిన AIకి చట్టపరమైన రచయిత హోదా ఉండదని తెలిపింది. AI ఆర్ట్‌ చేయగలదు.. కానీ దానికి చట్టపరమైన హక్కు దక్కాలంటే మనిషి పాత్ర ఎంత ఉండాలి? ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న.

ప్లాస్టిక్ వేటలో NSS..! 150 మంది వాలంటీర్ల స్పందన
Local· 3d ago

ప్లాస్టిక్ వేటలో NSS..! 150 మంది వాలంటీర్ల స్పందన

గుంటూరు జిల్లా ఆచార్య, నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్లాస్టిక్ నిర్మూలనకు భారీ స్పందన వచ్చింది. గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఇంజినీరింగ్ కాలేజ్ NSS యూనిట్ ఈ కార్యక్రమం చేపట్టింది. సుమారు 150 మంది వాలంటీర్లు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు.<br>ప్రిన్సిపాల్ లింగరాజు, NSS కోఆర్డినేటర్ దివ్య తేజోమూర్తి మార్గదర్శకత్వంలో ఈ డ్రైవ్ జరిగింది.

తెరుచుకోని రేషన్ షాపు..
Local· 3d ago

తెరుచుకోని రేషన్ షాపు..

కాకినాడ నగరం, ద్వారక నగర్ లో రేషన్ షాపు మూసి ఉంది. ఉదయం నుంచి ఇంకా తెరవలేదు. నెల ఆరంభం కావడంతో ప్రజలు బియ్యం, పంచదార కోసం వచ్చారు. కానీ షాపు మూసి ఉండడంతో ఆగ్రహంగా మండిపడుతున్నారు. ఒక వృద్ధురాలు డీలర్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. సాయంత్రమైనా షాపు తెరవలేదు.<br>తక్షణమే అధికారులు స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్య ఎదుర్కొంటున్నారా? అయితే కామెంట్ చేయండి.

వేముల్ నార్వలో హైమాస్ట్ లైట్లు..!
Local· 3d ago

వేముల్ నార్వలో హైమాస్ట్ లైట్లు..!

రంగారెడ్డి జిల్లా, కేశంపేట మండలం వేముల్ నార్వ, చౌదరి గూడలో ఎమ్మెల్సీ నవీన్, రెడ్డి తన సొంత నిధులతో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. మంగళవారం గ్రామస్తుల సమక్షంలో ఆయన వాటిని ప్రారంభించారు. ఈ లైట్ల వల్ల రాత్రిపూట గ్రామాలు వెలుగులతో నిండిపోతాయి. స్థానికులు సంతోషంగా, "ఎమ్మెల్సీ తన సొంత డబ్బుతో మా గ్రామాభివృద్ధి చేయడం గొప్ప విషయం" అంటూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని, ఆయన ఉన్నత పదవులు అధిరోహించాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

లక్ష్మీపూర్ పాఠశాలకు FLN బృందం..!
Local· 3d ago

లక్ష్మీపూర్ పాఠశాలకు FLN బృందం..!

మంచిర్యాల జిల్లా, లక్షెట్టిపేట మండలం లక్ష్మీపూర్ ప్రభుత్వ పాఠశాలను FLN జిల్లా ప్యానల్ బృందం సందర్శించింది. మంగళవారం వారు ఆ పాఠశాలకు వచ్చి, అక్కడి రికార్డులన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అంతేకాదు, ఉపాధ్యాయుల బోధనా పనితీరును, విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యాన్ని కూడా పరిశీలించారు. పాఠశాల HM చంద్రయ్య మరియు టీం లీడర్ మధుకర్ ఈ సందర్శనలో పాల్గొన్నారు. ఈ తనిఖీలో విద్యార్థుల అభ్యసన స్థాయిలు ఎలా ఉన్నాయనేదే ప్రధాన దృష్టి. ఇలాంటి తనిఖీలు రెగ్యులర్ అయితే విద్యాభివృద్ధి ఆగకుండా ఉంటుందని స్థానికులు అంటున్నారు.

క్యాన్సర్ పట్ల అప్రమత్తం..! జడ్జి సూచన
Local· 3d ago

క్యాన్సర్ పట్ల అప్రమత్తం..! జడ్జి సూచన

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ, మాధవి క్యాన్సర్ పై కీలక సూచనలు ఇచ్చారు. మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత న్యాయవాది చాప, కిషోర్ సంతాప సభలో ఆమె పాల్గొని, "క్యాన్సర్ రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి" అని సూచించారు. వ్యాధి వచ్చిన తర్వాత పోరాడే కంటే ముందస్తు పరీక్షలు, అప్రమత్తతే మేలని స్పష్టం చేశారు.క్యాన్సర్ తో తోటి న్యాయవాది మరణించడం తీవ్ర బాధాకరమని, అందుకే ఆమె న్యాయవాదులకు, ప్రజలకు ఈ సందేశం ఇచ్చారు.

రాహుల్ గాంధీపై కేసు.. సిగ్గుచేటు!
Local· 3d ago

రాహుల్ గాంధీపై కేసు.. సిగ్గుచేటు!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించింది. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్, గాంధీపై అక్రమంగా ఎఫ్ఐఆర్ పెట్టడాన్ని నిరసిస్తూ ఈ ఆందోళన జరిగింది. ఎంపీ బలరాం, నాయక్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాహుల్ గాంధీపై ఇలా కేసు పెట్టడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మురళి, నాయక్ ప్రజాస్వామ్య పద్ధతిలోనే పోరాడతామన్నారు. బీజేపీ కుట్రలను ఎండగడతామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు భూక్య, ఉమా నాయక్ హెచ్చరించారు.