← Back to news

క్యాన్సర్ పట్ల అప్రమత్తం..! జడ్జి సూచన

By Pinjari Shiva Kumar· 3d ago
క్యాన్సర్ పట్ల అప్రమత్తం..! జడ్జి సూచన

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో జూనియర్ సివిల్ జడ్జి వినుకొండ, మాధవి క్యాన్సర్ పై కీలక సూచనలు ఇచ్చారు. మంగళవారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన దివంగత న్యాయవాది చాప, కిషోర్ సంతాప సభలో ఆమె పాల్గొని, "క్యాన్సర్ రాకముందే జాగ్రత్తలు తీసుకోవాలి" అని సూచించారు. వ్యాధి వచ్చిన తర్వాత పోరాడే కంటే ముందస్తు పరీక్షలు, అప్రమత్తతే మేలని స్పష్టం చేశారు.క్యాన్సర్ తో తోటి న్యాయవాది మరణించడం తీవ్ర బాధాకరమని, అందుకే ఆమె న్యాయవాదులకు, ప్రజలకు ఈ సందేశం ఇచ్చారు.

More in Local