ఇండియన్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి BCCI స్పెషల్ ఆఫర్!

ఇండియన్ క్రికెట్ నయా సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి BCCI స్పెషల్ వెసులుబాటు కల్పించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికైన ఈ 15 ఏళ్ల యువ బ్యాటర్తో పాటు అతడి తల్లిదండ్రులను కూడా వెంట తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. వారి ట్రావెల్, వసతి ఖర్చులన్నీ బోర్డే భరించనుంది. IPLలో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్, విదేశాల్లో తన తల్లిదండ్రులతో కంఫర్ట్గా ఉండేందుకే ఈ స్పెషల్ నిర్ణయం తీసుకున్నట్లు BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఈ సీజన్లో వైభవ్ మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్గా నిలిచాడు.



